ఉపాధి హామీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర : ష‌ర్మిలా రెడ్డి

వైఎస్సార్ ఆశ‌యాల నుంచి పుట్టిందే ఉపాధి హామీ ప‌థ‌కం

ప్ర‌కాశం జిల్లా : ఉపాధి హ‌మీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర‌కు తెర లేపిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర శుక్ర‌వారం ప్ర‌కాశం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌సంగించారు. పీఎం మోదీ కావాల‌ని మ‌హాత్మా ఉపాధి హ‌మీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేశార‌ని, ఉన్న చ‌ట్టానికి మంగ‌ళం పాడేందుకు శ్రీ‌కారం చుట్టార‌ని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి. కూలీల పాలిట శాపంగా మారిందన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం దారుణ‌మ‌న్నారు. YSR ఆశయాల నుంచి పుట్టిందే ఉపాధి హామీ ప‌థ‌కం అన్నారు.

ఆనాడు 2006 లో దేశంలోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ప్రారంభం అయిందన్నారు. YSR హయాంలో ఉపాధి హామీ పని పండుగలా నడిచిందని చెప్పారు ష‌ర్మిలా రెడ్డి. కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాన్ని రాష్ట్రంలో అద్భుతంగా YSR ఉపయోగించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి మన్రేగా పథకం దోహద ప‌డింద‌న్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక ఉపాధి హామీ పనిపై కుట్రలు చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పూర్తిగా దేశంలో ఈ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందన్నారు. అందుకే పథకం ప్రకారం మన్రేగా ను చంపి కొత్త చట్టం తెచ్చారని మండిప‌డ్డారు. మోదీ తెచ్చిన VB G – RAM G చట్టం అక్రమ చట్టం అని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *