కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల పాలిట శాపం

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి . రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర మార్కాపురం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా తుమ్మలచెరువు గ్రామంలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్రకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 20 ఏళ్ల క్రితం మహానేత YSR ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమైన కరువు పనితో గ్రామాలు బాగుపడ్డాయని, 100 రోజుల పాటు ఉపాధి హక్కుగా మారిందని, కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరిందని గ్రామస్థులు గొప్పగా చెప్పారని అన్నారు ష‌ర్మిలా రెడ్డి.

కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన నాటినుంచే ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట్టిందని ఆరోపించారు. సగటున 50 రోజులు కూడా పని ఇవ్వడం లేదని మండిప‌డ్డారు. చేసిన పనికి సైతం వేతనాలు ఎప్పడు ఇస్తారో తెలియని అయోమయం నెల‌కొందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మన్రేగా పథకానికి, ప్రధాని మోడీ తెచ్చిన VB G – RAM G ( వీబీ గ్రామ్ జి ) చట్టానికున్న వ్యత్యాసాలను తుమ్మల చెరువు గ్రామ ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. 100 రోజుల పని చట్టాన్నే పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెచ్చిన అక్రమ చట్టం వీబీ గ్రామ్ జి ని రద్దు చేసేవరకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కొన‌సాగుతుంద‌ని హెచ్చ‌రించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *