చేనేత‌న్న‌ల‌కు రూ. 495 కోట్ల పెన్ష‌న్లు : ఎస్. స‌విత‌

శాస‌న మండ‌లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెల్ల‌డి

అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్ర ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ నేత‌న్న‌ల గురించి ప‌ట్టంచు కోలేద‌ని ఆరోపించారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్ర బాబుదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత‌ నేతన్నలకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన నేత‌న్న‌ల‌కు రూ.495 కోట్లు పెన్షన్ల రూపంలో అందజేశామని వెల్లడించారు.

నేతన్నల కష్టాలకు గత ప్రభుత్వమే కారణమని మంత్రి సవిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆప్కోను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆప్కో పేరుతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు గత దారి మళ్లించిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ నిధులు ఏవిధంగా వాడారో కూడా తెలియడం లేదన్నారు. దారి మళ్లిన రూ.120 కోట్లను రాబట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతోందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఆప్కోలో మురుగు పోతున్న పాత స్టాక్ ను తొలగించి కొత్తగా కొనుగోలు చేసిన వస్త్రాలను అమ్మకాలకు పెడుతున్నామన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *