రాజమౌళితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వార‌ణాసి న‌టి ప్రియాంక చోప్రా

అమెరికా : ప్ర‌ముఖ హీరోయిన్ వార‌ణాసి మూవీలో కీల‌క రోల్ పోషించిన ప్రియాంక చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్, ప్రిన్స్ మ‌హేష్ బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సంద‌ర్బంగా అంత‌ర్జాతీయ ప‌రంగా పేరు పొందిన ఛాన‌ల్ కు ఈ ముగ్గురూ చిట్ చాట్ చేశారు. ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ప్రియాంక చోప్రా. త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. త‌ను జీవితంలో కూడా జ‌క్క‌న్న సినిమాలో న‌టిస్తాన‌ని అనుకోలేద‌ని పేర్కొన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరైన రాజమౌళి దర్శకత్వంలో నటించడం మామూలు విష‌యం కాద‌న్నారు.

ప్ర‌త్యేకించి ఇది నా కెరీర్‌లో అర్థవంతమైన చిత్రం అవుతుందని అన్నారు. అభిమానులతో పాటు నేను కూడా దీని విడుదల కోసం ఎంత‌గానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ప్రియాంక అన్నారు. వారణాసిలో ఆమె మందాకినిగా కనిపిస్తుంది, కథనంలో కీలకమైన పాత్ర. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ సెన్సేషన్ RRR తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు, కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *