ఆ వెంక‌న్న మా మొర ఆల‌కించాడు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా భువ‌నేశ్వ‌రి

అమ‌రావ‌తి : హెరిటేజ్ ఎండీ, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌మ సంస్థ హెరిటేజ్ ద్వారా త‌యారు చేస్తున్న ఉత్ప‌త్తుల నాణ్య‌త‌పై కీల‌క తీర్పు వెలువ‌రించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం నారా భువ‌నేశ్వ‌రి ఎక్స్ మాధ్య‌మం వేదిక‌గా స్పందించారు. కొంద‌రు కావాల‌ని త‌మ సంస్థ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని , ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు నారా భువ‌నేశ్వ‌రి.

హెరిటేజ్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆనందంగా ఉంద‌న్నారు. గ‌త 33 ఏళ్లుగా తాజా పాల ఉత్పత్తులను అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుందని స్ప‌ష్టం చేశారు. 500 మందికిపైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని తెలుసు కోవాల‌ని అన్నారు. చూసిందే న‌మ్మాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *