జ్ఞాన బాండాగారాలుగా గ్రంథాల‌యాలు ఉండాలి

కీల‌క సూచ‌న‌లు చేసిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : జీవితంలో అత్యున్న‌త‌మైన స్థానానికి చేరుకోవాలంటే త‌ప్ప‌కుండా పుస్త‌కాలు చద‌వాల‌ని అన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉండాలని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వం అన్ని రంగాల‌ను నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. ఇదే క్ర‌మంలో కీల‌క‌మైన విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో పాటు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు నారా లోకేష్. ఇదే క్ర‌మంలో మాన‌వ జీవ‌న పురోభివృద్దిలో కీల‌క పాత్ర పోషించే గ్రంథాల‌యాల‌ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *