టీమిండియాను ఓడించి తీరుతాం : సికింద‌ర్

VijayaBhaskar · February 26, 2026
Spread the love

జింబాబ్వే కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

చెన్నై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై. ఇవాళ భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు సూప‌ర్ -8 లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో ఊహంచ‌ని రీతిలో ద‌క్షిణాఫ్రికా చేతిలో దారుణంగా 67 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని టీమిండియాపై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంది. ఇప్ప‌టికే ఆశించిన మేర ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌క పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు. ఇండియా ఇంకా రెండు కీల‌క మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ప్ర‌స్తుతం ఇవాళ జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుండ‌గా మ‌రో మ్యాచ్ వెస్టిండీస్ తో త‌ల‌ప‌డాల్సి ఉంది . ఇదిలా ఉండ‌గా భార‌త్ తో జ‌రిగే మ్యాచ్ గురించి స్పందించాడు జింబాబ్వే జ‌ట్టు కెప్టెన్ సికింద‌ర్ రజా.
భారతదేశం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటి, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో భారత్‌ను ఓడించడం చాలా కఠినమైన పని. అయినప్పటికీ, భారతదేశం ప్రస్తుతం కొంత ఒత్తిడిలో ఉంది. మేము భార‌త జ‌ట్టును ఓడించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించాడు. మా జ‌ట్టు ఆట‌గాళ్లు త‌ల‌ప‌డేందుకు రెడీగా ఉన్నారంటూ స్ప‌ష్టం చేశాడు సికింద‌ర్ ర‌జా.