ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి. మీ ప్ర‌తి చ‌ర్య పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి.. ప్ర‌జాప్ర‌యోజ‌నమే ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంటే.. ప‌రిపాల‌న సుల‌భమౌతుంది. వారి మ‌ద్ధ‌తు కూడా సంపూర్ణంగా అందుతుంది. చ‌రిత్ర‌ను ఫాలో అయి.. మీ విభాగాల్లో ఎవ‌రికి వారు కొత్త చ‌రిత్ర‌ను సృష్టించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. గ్రూప్ -1 కేడ‌ర్‌కు ఎంపికైన ఉద్యోగుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంల భాగంగా డా. మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడారు. హైడ్రా కార్య‌క‌లాపాల‌ను వివ‌రించారు.

ఆదిలో హైడ్రా ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను.. వాటిని అధిగ‌మించిన తీరును తెలిపారు. హైడ్రా అంటే ప్ర‌జ‌ల్లో పూర్తిగా అవ‌గాహ‌న రావ‌డంతో తాము చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పూర్తి స్థాయి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంద‌న్నారు. సామాజిక మాధ్య‌మాల్లో గ‌మ‌నిస్తే హైడ్రా అంటే ఆదిలో దాదాపు 70 శాతం నెగిటివిటీ క‌నిపించేదన్నారు. ఇప్పుడా శాతం రివ‌ర్స్ అయ్యింద‌న్నారు. 85 శాతం మంది హైడ్రా ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉన్నార‌న్నారు. ఇదంతా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా మ‌న కార్య‌క‌లాపాలు సాగించ‌డం.. గ్రౌండ్‌మీద ఫ‌లితాలు చూపించ‌డంతో సాధ్య‌మైంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *