తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వ‌ర్షాలు

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రాన్ని వ‌ర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క సూచ‌న‌లు చేసింది. భారీ ఎత్తున ప‌లు జిల్లాల్లో చేతికి వ‌చ్చిన పంట‌లు నేల రాలాయి. పంట న‌ష్టంపై అంచ‌నాలు త‌యారు చేయాల‌ని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *