ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు

హైద‌రాబాద్ : స‌ర్కార్ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సభలో గుర్తుచేశారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల రూ. 9,200 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా లేదా అన్నది తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఒకవేళ ఇంకా చెల్లించక పోతే, ప్రభుత్వం ఆర్టీసీకి ఎంత బాకీ ఉందో మంత్రి స్పష్టంగా చెప్పాలన్నారు.
ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? ఒకవేళ సంస్థ లాభాల్లోనే ఉంటే.. కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్, ఏరియర్స్, సీసీఎస్ బకాయిలను ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హ‌రీష్ రావు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ డ్యూ ఉండి మూడేళ్లు అవుతోందన్నారు. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ కొత్త పీఆర్సీని ఎప్పటినుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *