ఐపీఎల్ ట్రోఫీ గెల‌వ‌డం నా ల‌క్ష్యం

షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా

ముంబై : ఈ ఏడాదిలో జ‌ర‌గ‌బోయే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌, అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెల‌వ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ముంబై ఇండియ‌న్స్ కెప్ట‌న్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడాడు. ఈనెల 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఈసారి త‌మ ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని, అది ఐపీఎల్ ను కైవ‌సం చేసుకోవ‌డం పైనే ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇది నా ముందున్న స‌వాల్ అని పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా.

ముంబై ఇండియన్స్ తరఫున ఆరోసారి ఐపీఎల్ గెలవడమే నా అంతిమ కల. ముంబై ఇండియన్స్‌కు ఇప్పటికే అద్భుతమైన వారసత్వం ఉందన్నాడు. కానీ నేను కొత్త కుర్రాడిగా వచ్చినప్పుడు, జట్టులోని అభిరుచి, కఠోర శ్రమ, మొత్తం జట్టు నాకు అందించిన మద్దతు నాకు ఇంకా గుర్తుందని చెప్పాడు పాండ్యా. ప్రజలు ముందుకు వచ్చి, కష్టపడి, అత్యుత్తమ క్రికెట్ ఆడే సంస్కృతి కొనసాగాలని నేను కోరుకుంటున్నానని తెలిపాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ క్రికెట్‌కు మేము ప్రాతినిధ్యం వహించాలని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు కెప్టెన్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *