మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం

సంతాపం వ్య‌క్తం చేసిన మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి : మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నిర్మ‌ల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును అతి వేగంగా వ‌స్తున్న టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల‌లో మంట‌లు చెల‌రేగాయి. బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్న వారిలో 14 మంది ప్ర‌యాణీకులు సజీవ ద‌హ‌నం అయ్యారని ప్రాథ‌మిక స‌మాచారం. ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌తాధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప‌ట్ల మంత్రులు గొట్టిపాటి ర‌వికుమార్, నారా లోకేష్ లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రమాద ఘటన పై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి వివరించారు అధికారులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ హామీ ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *