మార్కాపురం బ‌స్సు ప్రమాదం సీఎం సంతాపం

క్ష‌త‌గాత్రుల‌కు వైద్య సాయం అందించాలి

మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్ల‌వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం అని ప్ర‌క‌టించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు సీఎం.

ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు.
ఒక లారీ ప్రైవేట్ ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు వేగంగా ఆ రెండు వాహనాలను చుట్టుముట్టాయి. 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
నిర్మల్ ,జగిత్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో, బాధితులు , వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతాల నుండే ప్రయాణిస్తున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *