సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క మార్పులు తీసుకు వ‌స్తాం

విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి స‌మూల మార్పులు తీసుకు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంది కూట‌మి స‌ర్కార్. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు సింగ‌పూర్ ప్ర‌తినిధ‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు విజ‌య‌వాడ కేంద్రంలోని త‌న కార్యాల‌యం నుంచి. సింగపూర్ లో అమలు చేస్తున్న ఆధునిక తీర అభివృద్ధి నమూనాలను రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ పై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఆహార ఉత్పత్తుల నిల్వ, నాణ్యత పరిరక్షణ, నష్టాలను తగ్గించే విధానాలు, ఆధునిక కోల్డ్ చైన్ వ్యవస్థలపై ఇరు పక్షాలు ప్రశ్నలు అడిగి సమాధానాలు ఇచ్చుకున్నారు.

ఈ రంగంలో సాంకేతిక సహకారం పెంపుపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారం, జ్ఞాన మార్పిడి, పెట్టుబడుల అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆధునిక వ్యవసాయ విధానాలు, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ చర్చలు ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆఫిషియో, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *