నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

సంచ‌ల‌నంగా మారిన ప్ర‌తిభా రావ‌ల్

ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్త‌గా మంత్రివ‌ర్గం కొలువు తీరింది. శ‌నివారం అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఏడాదిలో జ‌రిగిన హింస‌కు కార‌ణం మాజీ ప్ర‌ధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ త‌రుణంలో తాజాగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేబినెట్ లో ఓ మ‌హిళ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను ఎవ‌రో కాదు మ‌హిళా జ‌ర్న‌లిస్టుగా గ‌తంలో ప‌ని చేసిన ప్ర‌తిభా రావ‌ల్. త‌ను చెన్నైలో ఏషియ‌న్ స్కూల్ ఆఫ్ జ‌ర్న‌లిజం ఇనిస్టిట్యూట్ లో చ‌దువుకున్నారు. యువ రాజకీయ నాయకురాలుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె నెపాల్ కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కీల‌క శాఖ‌లు అప్ప‌గించారు పీఎం. ఫెడ‌ర‌ల్ అఫైర్స్ , జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ , ల్యాండ్ మేనేజ్మెంట్, కోఆప‌రేటివ్స్ , పేద‌రిక నిర్మూల‌న శాఖ‌ల‌ను అప్ప‌గించారు ప్ర‌తిభా రావ‌ల్ కు. రాష్ట్రీయ స్వ‌తంత్ర పార్టీలో కీ రోల్ పోషిస్తోంది. త‌ను ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. త‌ను తొలుత జ‌ర్న‌లిస్టుగా త‌న కెరీర్ ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ఎంట‌రైంది. బయట నుంచి ప్రశ్నించడం సరిపోదు, పాలసీ స్థాయిలో పని చేయాలి అనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావ‌ల్సి వ‌చ్చింద‌ని ఒకానొక సంద‌ర్బంగా చెప్పింది. పార్టీ ప‌రంగా అధికార ప్ర‌తినిధిగా ప‌ని చేసింది. యువ‌త నుంచి వ‌చ్చిన కొత్త త‌రం నాయ‌కురాలిగా ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *