జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌ర్న‌లిస్టులు ఏపీ స‌ర్కార్ కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైంద‌ని చెప్పారు. జర్నలిస్టులకు నాడు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు కూడా చేశాం అని గుర్తు చేశారు సీఎం. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే విచారణకు జిల్లాలో ఎస్పీ స్థాయిలో కమిటీ విచారించేలా నిబంధనలు తెచ్చాం అన్నారు. 2014 తరువాత డెస్క్ జర్నలిస్టులకు, సబ్ ఎడిటిర్లకు అక్రిడేషన్లు, బస్సు ప్రయాణంలో రాయితీలు కల్పించడం జ‌రిగింద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

2014-19 మధ్య జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించామ‌ని, కానీ గ‌తంలో ఏపీలో కొలువు తీరిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైసీపీ స‌ర్కార్ వ‌చ్చాక తీసి వేశారంటూ ఆరోపించారు సీఎం. తాము 2018లో 20 వేల అక్రిడేషన్లు ఇస్తే… గత ప్రభుత్వం వాటిని సగానికి తగ్గించిందని మండిప‌డ్డారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తాం అని ప్ర‌క‌టించారు. హైదరాబాద్ లో మంత్రుల క్వార్టర్ల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్రెస్ క్లబ్ కు ఇచ్చాం అన్నారు. అమరావతిలో ఐజేయూ కార్యాలయానికి స్థలం ఇచ్చే అంశాన్ని సబ్ కమిటీకి అప్పగిస్తామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *