newsseals.com
News

విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్

Posted by: VijayaBhaskar April 5, 2026
newsseals-NavinMittal

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌వీన్ మిట్ట‌ల్

హైద‌రాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంద‌ని అన్నారు ఇంధ‌న శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన హనుమకొండలో జరిగిన ఏఐ హ్యాకథాన్‌పై సమీక్షా సమావేశంలో మిట్టల్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యుత్ రంగాన్ని టైప్‌రైటర్ల నుండి డిజిటల్ సామర్థ్యానికి ఎలా మారుస్తోందో వివరించారు. ఏఐ కొన్ని రోజుల పనిని కేవలం నిమిషాల్లో పూర్తి చేయగలదని ఆయన అన్నారు. విద్యుత్ రంగంలోని వివిధ యూనిట్లు ఏఐ పనితీరును ఎలా పునర్నిర్మిస్తోందో, ప్రస్తుత డిజిటల్ పద్ధతులు, భవిష్యత్ ఏఐ ప్రణాళికలను ప్రదర్శిస్తూ వివరించాయి.

ఏఐ (AI)ని సరిగ్గా వినియోగిస్తే సంస్థలను మార్చగల సామర్థ్యం దానికి ఉందని మిట్టల్ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగు పరచడానికి, తమ అవసరాలకు అనుగుణంగా ఏఐని రూపొందించు కోవాలని ఆయన విభాగాలను కోరారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడంలో ఉత్తర డిస్కామ్ తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. వేగవంతమైన, కచ్చితమైన , పారదర్శకమైన సేవలను అందించే లక్ష్యంతో ఆ సంస్థ దశలవారీ ఏఐ కార్యాచరణ ప్రణాళికను కలిగి ఉంద‌న్నారు.