క‌ర్ణాట‌క సంస్కృతి గొప్ప‌ది : నారా లోకేష్

కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండ‌టం భేష్

క‌ర్ణాట‌క : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ను ఘ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో క‌లిసి ప్రారంభించారు . అనంత‌రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు నారా లోకేష్ బాబు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయం అత్యంత గొప్పదని ప్ర‌శంస‌లు కురిపించారు.

సైనికుల ప్రాణ త్యాగాలు మనం ఎప్పటికీ మర్చి పోకూడదన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండాల‌న్నారు. అలా ఉంటేనే అభివృద్ధి సాధించ వ‌చ్చ‌న్నారు నారా లోకేష్‌. కుమార స్వామి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఆయ‌న కాపాడార‌ని, ఇందుకు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టం అన్నారు. త‌న‌కు ఎల్ల‌ప్పుడూ మ‌నం అండ‌గా ఉండాల‌ని కోరారు మంత్రి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *