ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు

మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్

అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌, ఏబీఎన్ న్యూస్ ఛాన‌ల్ య‌జ‌మాని, ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై తీవ్ర స్థాయిలో భ‌గ్గుమ‌న్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని బ‌రి తెగించాడ‌ని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే గంజాయ్ పండించిన వాడి కంటే నీచంగా తయార‌య్యాడ‌ని మండిప‌డ్డారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బు దండుకుంటున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పేర్ని నాని.

ఏరా నీ స్టూడియో లో పెళ్ళిళ్ళ బ్రోకర్ గా పనులు చేస్తున్నావా అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారో చెప్పాల‌ని నిల‌దీశాడు మాజీ మంత్రి. త‌మ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా? అని నిల‌దీశారు. ఇప్పుడు కాదు క‌దా వందేళ్లయినా అమరావతి పూర్తి కాదన్నారు. అమ‌రావ‌తి పేరుతో టీడీపీ కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *