అనిరుధ్ చేసిన‌ సాయం మరువలేను

ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ కామెంట్స్

హైద‌రాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లే సమయంలో తన దగ్గర కేవలం బస్సు ఛార్జీల కోసం రూ. 250 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తన బ్యాగులో రహస్యంగా రూ. 50,000 ఉంచి, బస్సులో ఉండగా మెసేజ్ చేశారని విఘ్నేష్ పేర్కొన్నారు. ఆ మెసేజ్ చూసి బస్సులో తన కళ్లు చెమర్చాయని చెప్పుకొచ్చారు.

తాజాగా విఘ్నేష్ శివ‌న్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఇదిలా ఉండ‌గా విఘ్నేష్ శివన్ తమిళ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు. రచయిత, నిర్మాత, లిరిసిస్ట్ (పాటల రచయిత). ఆయన తమిళ సినిమాల్లో ప్రేమకథలు, కామెడీ శైలిలో సినిమాలు రూపొందించి మంచి పేరు సంపాదించారు. విఘ్నేష్ శివన్ మొదట చిన్న సినిమాలు, మ్యూజిక్ వీడియోలతో కెరీర్ ప్రారంభించాడు. త‌ర్వాత సినీ ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు పొందాడు. త‌ను 2012లో పొందా పోడి సినిమాకు తొలి సారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *