రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వ‌చ్చింది

ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి

హైద‌రాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి నిప్పులు చెరిగారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత రాత‌లు రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ ఛాన‌ల్ య‌జ‌మాని, ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై. సిగ్గు, శ‌రం ఉన్న ఏ వ్య‌క్తి కూడా ఇలాంటి రాత‌లు రాయ‌ర‌ని మండిప‌డ్డారు. సోయి లేకుండా ఇష్టానుసారంగా మ‌హిళ‌లు అన్న క‌నీస గౌర‌వం, ఇంగిత జ్ఞానం లేకుండా అడ్డ‌గోలుగా ఏది ప‌డితే అది రాసుకుంటూ పోతే ఎలా అని సీరియ‌స్ అయ్యారు.

ఒక‌నాడు సైకిల్ పై తిరిగిన రాధాకృష్ణా ఎంత‌మందిని మోసం చేస్తే , ఎన్ని సూట్ కేసులు మార్చితే ఈ స్థాయికి వ‌చ్చావో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి. త‌క్ష‌ణ‌మే రాధాకృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. నీ పాపం పండే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని, ఆరోజున నిన్ను ఎవ‌రూ కాపాడ లేర‌న్నారు. అందుకే వైయస్‌ఆర్‌సీపీ మహిళల్ని ఆడి పోసుకుంటున్నావని నిప్పులు చెరిగారు. నీ కుటుంబం గురించి కూడా ఒకసారి నీ పత్రికలో రాయి.. అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్ట్‌వి అవుతావు అని అన్నారు. నీ తప్పుడు రాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల‌ని. అప్పటి వరకు నిన్ను వదిలి పెట్ట‌మ‌ని వార్నింగ్ ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *