తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం

జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

అమ‌రావ‌తి : కార్య‌క‌ర్త‌లు టీడీపీకి బ‌ల‌గ‌మ‌ని మీరు లేకపోతే పార్టీ లేద‌న్నారు రాష్ట్ర టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

తెలుగుదేశం కేడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా కాఫీ కబుర్లు పేరుతో పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ చార్జిలతో భేటీ అయ్యారు నారా లోకేష్‌. తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు సమూల మార్పులు తెస్తున్నాం అని ప్ర‌క‌టించారు . ప్రతి టర్మ్ లోనూ 33శాతం కొత్తవారు ఉండాలన్నది మా అభిమతం అని పేర్కొన్నారు. పైరవీలతో పనిలేదని, పనితీరే ప్రామాణికంగా పదవులు కేటాయిస్తాం అని వెల్ల‌డించారు నారా లోకేష్‌. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *