ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలుగుదేశం పార్టీ మ‌హానాడు

నిర్వ‌హిస్తామ‌న్న పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు

అమ‌రావ‌తి : ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మ‌హానాడు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు-2026 కోసం అనువైన వేదికను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నాథవలస, పైడిభీమవరం, రణస్థలం, డెంకాడ తదితర ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది అనువైన స్థలాలను పల్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును సీఎం, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో.. చారిత్రాత్మకంగా నిలిచేలా నిర్వహిస్తామని అన్నారు ప‌ల్లా శ్రీ‌నివాస్ రావు. లక్షలాది మంది కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా.. రవాణా, పార్కింగ్, భద్రత ,వాస్తు అనుకూలత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వేదికను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇప్ప‌టి నుంచే కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టామ‌ని చెప్పారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *