చంద్ర‌బాబు విజ‌న‌రీ లీడ‌ర్ : రాష్ట్ర‌ప‌తి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరు గురించి ప్ర‌త్యేకంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌స్తావించార‌ని తెలిపారు మంత్రి నారా లోకేష్‌. సోమ‌వారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీల‌తో క‌లిసి మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి తో భేటీ అయ్యారు. ఈసంద‌ర్బంగా అమ‌రావ‌తి రాజ‌ధానిపై సంత‌కం చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని కోసం తాము ప‌డిన క‌ష్టం గురించి ఏక‌రువు పెట్టారు నారా లోకేష్‌. రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు పిలుపుతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని చెప్పారు. గత పాలనలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా, శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమించారని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. 

కోట్లాది ప్ర‌జ‌ల కోరిక అయిన అమ‌రావ‌తి చ‌ట్టం త‌న హ‌యాంలో రూపొంద‌డం సంతోషంగా ఉంద‌ని, రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం తమ భూమిని ఇచ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండి పోతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధాని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పథంలో ప‌య‌నించాల‌ని, రాజ‌ధాని ప‌నులు నిర్విఘ్నంగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *