పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.
పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది స‌ర్కార్.

ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్న కాంటీన్లను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం . మొత్తంగా రాష్ట్రంలో 269 పెరిగిన అన్న క్యాంటీన్ల సంఖ్య. త్వరలో మరో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గడచిన 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రతీ రోజూ ఒక్కో అన్న క్యాంటీన్ లో సగటున 1013 మందికి భోజన సదుపాయం క‌లిగింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం రూ.243 కోట్లు వెచ్చించింద‌న్నారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *