టీవీకే పార్టీలో చేరిన న‌టి అను శ్రీ వేనాల్

కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించు కునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు పార్టీ బాస్, సీఎం ఎంకే స్టాలిన్. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ స్థాపించిన టీవీకే ప్ర‌చారంలో దూసుకు పోతోంది. నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఆయా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పార్టీల‌లో చేరుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్ర‌ముఖ న‌టి అను శ్రీ వేనాల్ ఆస‌క్తిక‌రంగా మారారు. త‌ను టీవీకే పార్టీలో చేరారు.

చెన్నై లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పార్టీ చీఫ్ , అగ్ర న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు అను శ్రీ వేనాల్. ఈ సంద‌ర్భంగా ఆమెకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆమెతో పాటు ప‌లువురు పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి టీవీకే బాస్ విజ‌య్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు తెర లేపారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మొత్తంగా ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చ‌ర్చ కొన‌సాగుతోంది. ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *