ఎంపీ సూర్య కామెంట్స్ పై రాముల‌మ్మ కన్నెర్ర‌

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి నిప్పులు చెరిగారు. ఆమె సీరియ‌స్ గా స్పందించారు. క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ తేజ‌స్వి సూర్య పార్ల‌మెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. బేష‌ర‌తుగా నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు రాముల‌మ్మ‌.

పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయ‌న్నారు. రాష్ట్రం ఊరికే రాలేద‌ని, 1200 మంది బలిదానం చేసుకుంటే వ‌చ్చింద‌ని అన్నారు విజ‌య‌శాంతి. చ‌రిత్ర తెలుసుకోకుండా నోరుంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే బాగుండద‌ని అన్నారు. ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా మాట్లాడ‌టం స‌భ్య‌త అనిపించు కోద‌ని పేర్కొన్నారు రాముల‌మ్మ‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *