తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక నుంచి ఎంఎంటీఎస్ లో ఉచిత ప్ర‌యాణం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో నిత్యం ఎంఎంటీఎస్ లో ప్ర‌యాణం చేసే వారికి తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ మేర‌కు ఎంఎంటీఎస్ రైళ్ల‌లో ఉచిత ప్ర‌యాణం చేసేందుకు , వెసులుబాటు క‌ల్పించేందుకు ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. జూన్ 2 నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిపారు సీఎస్ రామ‌కృష్ణా రావు. ఈ సంద‌ర్భంగా కేంద్ర రైల్వే బోర్డుకు ఉచిత ప్ర‌యాణానికి గాను అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది తెలంగాణ స‌ర్కార్. కాగా రైల్వేకు వచ్చే ఆదాయ లోటును భరించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతే కాకుండా ర‌ద్దీని త‌గ్గించేందుకు గాను ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు ఆర్టీసీ షటిల్ బస్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తోంది స‌ర్కార్. ఈ ఆలోచ‌న‌ను గ‌తంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ , క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ స‌ర్కార్, త‌మిళ‌నాడులో డీఎంకే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *