అన్న‌దాత‌ల‌కు వ‌రం రైతు భ‌రోసా ప‌థ‌కం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారాయ‌న్నారు. పంట పొలాలు, రైతుల జీవితాలు నిత్యం పచ్చగా ఉండాలన్న ఆశయంతో స‌ర్కార్ ప్రారంభించి రైతు భ‌రోసా ప‌థ‌కం రైత‌న్న‌ల పాలిట వ‌రంగా మారింద‌న్నారు. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదని, తెలంగాణ వ్యవసాయ చరిత్రను దేశానికే ఆదర్శంగా మార్చిన విప్లవం అని అభివ‌ర్ణించారు రేవంత్ రెడ్డి.

ప్రతి సీజన్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలకు చేర్చే మహా సంకల్పం అని అన్నారు. అందులో భాగంగా నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్ల కాటారం మండలం నస్తూరపల్లిలో వేలాది మంది రైతుల సమక్షంలో మలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేశామ‌న్నారు. తొలి, మలి విడతల్లో కలిపి ఇప్పటి వరకు రూ.5,700 కోట్లు రైతన్నల ఖాతాల్లో జమ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *