డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ బ‌లిదానం బాధాక‌రం

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆవేద‌న

హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ శంకర్ గౌడ్ బలిదానం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్. ఆయ‌న ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. తెలంగాణ చరిత్రలో శంకర్ గౌడ్ చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆవేశంతో ఆయన చేసిన త్యాగం తనతోటి వారికి వెన్నుదన్ను, కానీ ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని వాపోయారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి, వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నా, ఆందోళన చెందుతున్న వారికి విశ్వాసం కలగడం లేద‌న్నారు. దీని వ‌ల్ల‌నే ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు కార‌ణాలు అవుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాపోలు ఆనంద భాస్క‌ర్. ఈ ఘటనలు దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి, మంత్రుల బృందాన్ని రంగంలోకి దింపినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు శాంతియుతంగా చర్చలు జరపాలని కోరారు మాజీ ఎంపీ.

ఉద్యోగులు, కార్మికులు తమ డిమాండ్లను సాధించు కోవడం కోసం ఆందోళన వారి హక్కు అని పేర్కొన్నారు. తెలంగాణ‌ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి పోరాడార‌ని గుర్తు చేశారు.. వారి పోరాటం తెలంగాణ ఉద్యమంలో కీలకమైనదని కొనియాడారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *