లోకేష్ కృషి వ‌ల్లే విశాఖ‌కు గూగుల్ డేటా సెంట‌ర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విప్ పంచుమ‌ర్తి అనురాధ‌

అమ‌రావ‌తి : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ, నిరంతర శ్రమతో గూగుల్ డేటా సెంటర్‌ను వైజాగ్‌కు తీసుకు రావడంలో విజయవంతం అయ్యార‌ని ప్ర‌శంసించారు శాస‌న మండ‌లి విప్ పంచుమ‌ర్తి అనురాధ‌. కేవలం ఒప్పందం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్ట్ గ్రౌండ్ అయి యువతకు ఉద్యోగాలు కల్పించేలానే ఉద్దేశంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారని ప్ర‌శంసించ‌చారు. గూగుల్ సంస్థకు 610 ఎకరాల భూమిని కేటాయించడం జ‌రిగింద‌న్నారు. ఈనెల 28న సీఎం శంకుస్తాప‌న చేయ‌నున్నార‌ని, ఈ క్రెడిట్ లోకేష్ కు ద‌క్కుతుంద‌న్నారు అనురాధ‌.

ఇది ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనం అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం 1 గిగావాట్ డేటా హబ్‌గా ఎదగనుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సబ్‌సీ కేబుల్స్ ద్వారా ప్రపంచానికి డేటా సేవలను అందించే కేంద్రంగా మారనుందని చె్పారు.. క్లౌడ్ ఆపరేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.80 లక్షల ఉద్యోగాలు రానున్నాయ‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *