చుక్క‌లు చూపించిన సాయి సుద‌ర్శ‌న్

ఆడుతూ పాడుతూ గెలుపొందిన గుజ‌రాత్

చెన్నై : స్వంత మైదానం చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు అంత‌గా స‌హ‌క‌రించ‌డం లేదు. ఆడిన మ్యాచ్ లో ఆశించిన ప‌ర్ ఫార్మెన్స్ ఆ జ‌ట్టు నుంచి రావ‌డం లేదు. ముంబై ఇండియ‌న్స్ తో సెంచ‌రీ చేసిన సంజు శాంస‌న్ గుజ‌రాత్ తో తేలి పోయాడు. ఇక మిగ‌తా ఆటగాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ లేదు. చివ‌ర‌కు క‌నీసం 100 ర‌న్స్ అయినా చేస్తుందా లేదా అని ఆందోళ‌న‌కు గుర‌య్యారు చెన్నై అభిమానులు. ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్లు. ర‌బాడా, అర్ష‌ద్ ఖాన్ లు క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఇక్క‌ట్ల‌పాలు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 158 ర‌న్స్ చేసింది. ఒక ర‌కంగా ప‌రువు పోకుండా కాపాడాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. త‌ను 74 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ను పూర్తి చేసింద మొదట్నుంచే గిల్‌, సుదర్శన్‌ ప్రత్యర్థి బౌలర్లపై సిక్స్‌లు, బౌండరీలతో విరుచుకు ప‌డ్డారు. ఆ జట్టు గెలుపునకు మంచి ఆరంభాన్ని అందించారు. మూడు సిక్స్‌లతో జోరుమీద కనిపించిన గిల్‌ను నూర్‌ తన తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించడంతో టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ నిష్క్రమించినా ఆ ప్రభావం ఛేదనపై పడకుండా బట్లర్‌ అండతో సాయి రెచ్చిపోయాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *