తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది డీజిల్, పెట్రోల్ కొర‌త లేకుండా . ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భారీగా స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఆదేశించారు. దీంతో భారీగా సరఫరా పెంచడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 27 నాటికి, రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151% పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి 18,449 కిలో లీటర్లకు పెరిగింది. గా పెట్రోల్ పంపిణీ కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. ఇది 95% పెరిగి 5,883 కిలో లీటర్ల నుంచి 11,490 కిలో లీటర్లకు చేరుకుంది.

రాజధాని ప్రాంతంలో ఎలాంటి కొరత రాకుండా చూడటానికి, హైదరాబాద్‌లో ఇంధన సరఫరాను 43% మేర పెంచారు. నగరంలో డీజిల్ నిల్వలను 46% (3,393 నుంచి 4,957 కిలో లీటర్లకు), పెట్రోల్ నిల్వలను 40% (3,908 నుంచి 5,466 కిలో లీటర్లకు) పెంచారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని పౌర సరఫరాల శాఖ ప్రజలకు హామీ ఇస్తోంది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎప్పటిలాగే తమకు అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రజల, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు పెట్రోల్ బంకుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయ

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *