సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైద‌రాబాద్ : సేవాద‌ళ్ వాలంటీర్లు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. స్వాతంత్య్ర‌ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో సేవాదళ్ వాలంటీర్లు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు బలమైన వారధిలా పని చేస్తున్నారని అన్నారు. ఇటువంటి శిబిరాల ద్వారా కార్యకర్తల్లో నాయకత్వ పటిమతో పాటు ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఇది పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ‘నేను.. నాది’ అనే స్వార్థం పెరిగి పోయి, ‘మనం.. మనది’ అనే సామాజిక స్పృహ తగ్గి పోతోందని ఆవేద‌న చెందారు జూప‌ల్లి. రాజకీయాల్లో కేవలం ఎలా సంపాదించు కోవాలనే ధ్యాస పెరిగి, సేవాభావం క్రమంగా క్షీణిస్తోందని అన్నారు. సమాజంలో నేటికీ ఎంతోకొంత విలువలు మిగిలి ఉన్నాయంటే అది సేవాదళ్ వంటి నికార్సైన నాయకులు, వాలంటీర్ల కృషి వల్లే. మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యర్థులు సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టేలా కార్యకర్తలు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న సేవాదళ్ కార్యకర్తలకు గుర్తింపు దక్కేలా చూస్తాన‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *