తెలంగాణ ఆర్టీసీ కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

కేసులు ఎత్తివేత‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆయా కార్మిక సంఘాల నేత‌లు చేసిన విన‌తుల‌ను సావ‌ధానంగా విన్నారు. ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నార‌ని, వారు పోషించిన పాత్ర అద్భుత‌మ‌ని కొనియాడారు సీఎం.

వారు చేసిన త్యాగాలు, ఆత్మ బ‌లిదానాలు, ఆందోళ‌న‌ల కార‌ణంగానే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు రేవంత్ రెడ్డి. 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించినట్లు ప్ర‌క‌టించారు. సమ్మె కాలంలో వేతనం ఇస్తామ‌ని, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *