క‌విత పార్టీని న‌మ్మి మోస‌పోవ‌ద్దు : కేఏ పాల్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్

హైద‌రాబాద్ : ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ అంబాసిడ‌ర్ , ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త పార్టీని ప్ర‌క‌టించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం పాల్ మీడియాతో మాట్లాడారు. క‌విత పార్టీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కేవలం తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌తో ఉన్న విభేదాల వల్లే కవిత పార్టీ పెట్టారని పాల్ విమర్శించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ షర్మిల పార్టీలు నిలబడలేక పోయాయని, కవిత మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి నిలకడలేని వాళ్లను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవొద్దని పాల్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ పెట్టే వాళ్ల గురించి ఆలోచించ వ‌ద్ద‌ని కోరారు పాల్. తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసిందో చెప్పాల‌న్నారు. తెలంగాణ‌ను అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా సంపాదించార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు ఆమెను, పార్టీని న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌న్నారు డాక్ట‌ర్ కేఏ పాల్. ప్ర‌జ‌లు ఆమెను చూసి న‌వ్వుకుంటున్నార‌ని ఆరోపించారు. త‌ను కూడా మ‌రో ష‌ర్మిల‌, చిరంజీవి కాక త‌ప్ప‌ద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *