ట్రాఫిక్ జామ్ నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక క‌మిటీ

ఏర్పాటు చేస్తున్నామ‌న్న డీజీపీ సీవీ ఆనంద్

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌త్యేకంగా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నూత‌న డీజీపీ సీవీ ఆనంద్. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని డిజిపి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు .

ఐఎస్ డబ్ల్యూ, సీఎస్ డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి. సజ్జనార్, సైబరాబాద్ సిపి ఎం. రమేష్, మల్కాజిగిరి సిపి బి. సుమతి, ఫ్యూచర్ సిటీ జాయింట్ సిపి చందనా దీప్తి, రైల్వేలు , రోడ్డు సేఫ్టీ ఐజిపి రమేష్ నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఐఎస్డబ్ల్యూ ఓఎస్డి కమలాసన్ రెడ్డి, సిఎంఎస్జి ఎస్పీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *