సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో శుక్ర‌వారం జ‌రిగిన రెండో రోజు జిల్లా క‌లెక్ట‌ర్ల స‌దస్సుకు అధ్య‌క్ష‌త వ‌హించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ స‌మావేశానికి రాష్ట్రంలోని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి అనిత వంగ‌లపూడి. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో రాష్ట్రం అన్ని రంగాల‌లో ముందుకు వెళుతోంద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి దిశగా ముందుకు సాగుతోందని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ఈ స‌ద‌స్సులో సంప‌ద‌పై దృష్టి సారించ‌డం జ‌రిగింద‌న్నారు. సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం సాధ్యం అని సీఎం దిశా నిర్దేశం చేశార‌ని చెప్పారు. ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత 23 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జ‌రిగాయ‌న్నారు. వీటి ద్వారా 24 లక్షల ఉద్యోగాల క‌ల్ప‌నే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ప్రజా సమస్యలపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డుల ఆధునీకరణ చేస్తామ‌ని తెలిపారు అనిత వంగ‌ల‌పూడి. గ్రీన్ ఎనర్జీ, AI, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా మారుస్తామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *