ప్ర‌తిప‌క్షనేత‌ల‌తో క‌ర‌చాల‌నం సీఎం సంచ‌ల‌నం

మాజీ సీఎం స్టాలిన్, వైగో, సీమాన్ తో స‌మావేశం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూట‌మితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజ‌య్ వ‌చ్చీ రావ‌డంతోనే కొత్త సంప్రాదాయానికి నాంది ప‌లికారు. రాజ‌కీయాలు అనేవి కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన వెంట‌నే నేరుగా స‌చివాల‌యంకు వెళ్లారు. అత్యంత స‌మ‌ర్థ‌వంతులైన‌, నీతి నిజాయితీ క‌లిగిన అధికారుల‌ను నియ‌మించుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లారు. చాలా సేపు ఈ ఇద్ద‌రు మాట్లాడు కోవ‌డం క‌ల‌క‌లం రేపింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

అనంత‌రం మ‌రో అగ్ర నేత వైగో ఇంటికి స్వ‌యంగా వెళ్లారు. కుటుంబ స‌భ్యుల‌ను ప‌ల‌క‌రించారు. అక్క‌డి నుంచి న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు సీమాన్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు . అన్బుమణి రామదాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం విజ‌య్. అందరితో సమన్వయంతో ముందుకు సాగుతాననే సంకేతాలను ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తమిళనాడు సీఎం విజయ్‌కి Z+ కల్పించింది. 55 మంది కేంద్ర భద్రతా సిబ్బందితో 24 గంటల భద్రతను ఏర్పాటు చేసింది. సీఎం భద్రతా బృందంలో 10 మందికి పైగా NSG కమాండోలు ఉంటారు. వీరితో పాటు CRPF, CISF, ITBP సిబ్బంది కూడా ఉన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *