వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

స్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్

న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్ కు షాక్ త‌గిలింది. ఇదంతా కావాల‌ని త‌న‌ను సీఎం కాకుండా చేశారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు కేసీ వేణుగోపాల్ న్యూఢి్ల్లీలో. వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని, వారికంటే పార్టీ ముఖ్య‌మ‌ని స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడిన కార్యకర్తను. పార్టీ, ప్రజలే నాకు ముఖ్యం. నేను ఎల్లప్పుడూ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తాను విధేయుడైన కాంగ్రెస్ నాయకుడిగానే ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. 63 మంది ఎమ్మెల్యేలలో చాలా మంది మద్దతు క‌లిగి ఉన్నారు .

ఈ విషయాన్ని కేరళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్‌మున్షీ కూడా ధృవీకరించారు. ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న కేసీ వేణుగోపాల్ వి.డి. సతీశన్‌ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా నియమించాలన్న ఏఐసీసీ నిర్ణయాన్ని అంగీకరించారు. అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న నాయకత్వం ఎంపికను అంగీకరించాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. కేరళలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుంది అని ఆయన అన్నారు. వేణుగోపాల్ అలప్పుళ లోక్‌సభ సభ్యుడిగా (MP) ఉన్నందున, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం అంటే రెండు ఉప ఎన్నికలకు దారితీయడమే అవుతుందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *