శ్రీ‌లంక టూర్ కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక

కెప్టెన్ గా హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌

ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించి భార‌త -ఎ – జ‌ట్టు ను ప్ర‌క‌టించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌కు ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ సిక్స‌ర్లు, ఫోర్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక A, ఇండియా A , ఆఫ్ఘనిస్తాన్ A జట్లు తలపడతాయి. ఈ టోర్నీ జూన్ లో జ‌ర‌గ‌నుంది . ఈ పరిమిత ఓవర్ల ముక్కోణపు సిరీస్ ముగిసిన తర్వాత, ఇండియా A జట్టు శ్రీలంక Aతో రెండు బహుళ-రోజుల (multi-day) మ్యాచ్‌లను కూడా ఆడనుంది; ఈ ‘రెడ్-బాల్’ మ్యాచ్‌ల కోసం జట్టును తర్వాతి తేదీలో ప్రకటిస్తారు.

ఇదిలా ఉండ‌గా ఈ ‘వైట్-బాల్’ సిరీస్ దంబుల్లాలో జరుగుతుంది, కాగా బహుళ-రోజుల మ్యాచ్‌లు గాలేలో జరుగుతాయి. ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా A జట్టుకు హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇక జ‌ట్టును బీసీసీఐ సెల‌క్షన్ క‌మిటీ ప్ర‌క‌టించింది. జ‌ట్టు ప‌రంగా చూస్తే తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బడోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (WK), కుమార్ కుశాగ్ర (WK), విప్రాజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుద్ధవీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్ ఆడ‌నున్నారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *