హైద‌రాబాద్ లో భారీ అవినీతి తిమింగ‌లం ప‌ట్టివేత‌

HMWSSB జనరల్ మేనేజర్ ఆభ‌ర‌ణాలు, నోట్ల క‌ట్ట‌లు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో మ‌రో భారీ అవినీతి తిమింగ‌లం ప‌ట్టుబ‌డింది. మంగ‌ళ‌వారం ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని స‌మాచారం రావ‌డంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ఏక‌కాలంలో దాడులు చేప‌ట్టింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన నివాసంలో. ఈ దాడుల‌లో క‌ళ్లు చెదిరేలా నోట్ల క‌ట్ట‌లు, బంగారు ఆభ‌ర‌ణాలు బ‌య‌ట ప‌డ్డాయి. అంత‌కు మించి అక్ర‌మంగా కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన ప‌త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌దు ఏకంగా రూ. 1.06 కోట్లు ల‌భించ‌డంతో విస్తు పోయారు ఏసీబీ సిబ్బంది.

అక్రమాస్తుల కేసులో భాగంగా HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ (GM) అయిన కుమార్ నివాసంపై మంగళవారం ACB అధికారులు సికింద్రాబాద్‌లో దాడులు నిర్వహించారు . ఈ సోదాల సమయంలో అధికారులకు బంగారు ఆభరణాలు , పలు ఆస్తి పత్రాలు కూడా లభించాయి. బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉంది ఇప్ప‌టి దాకా రూ. 1.05 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి లభించిన‌ట్లు ఏసీబీ ప్ర‌క‌టించింది. జనరల్ మేనేజర్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ప‌లు చోట్ల ఇంకా సోదాలు కొన‌సాగుతున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *