భార‌త్ ఇట‌లీ మ‌ధ్య బంధం బలీయ‌మైన‌ది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ

ఇట‌లీ : భారత్ ఇట‌లీ దేశాల మ‌ధ్య బంధం అత్యంత బ‌లీయ‌మైన‌ద‌ని అన్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇటలీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా బుధ‌వారం మోదీ ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి మెలోనీతో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆయ‌న అడుగు పెట్టిన వెంట‌నే మెలోనితో విందులో పాల్గొనే అవకాశం లభించింది.. ఆ తర్వాత ప్రఖ్యాత కొలోసియంను సందర్శించారు. అనేక విస్తృత అంశాలపై త‌మ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భారతదేశం-ఇటలీ మైత్రిని మరింత బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై త‌మ‌ సంభాషణను కొనసాగించారు. చర్చలు అత్యంత ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగిన‌ట్లు చెప్పారు ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

ఇద్దరూ విందులో పాల్గొన్నారు, అనంతరం కొలోస్సియంను సందర్శించారు, అక్కడ వారు పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు నాయకులు తమ పర్యటనకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు, ఇది వారి సమావేశం గురించి ఒక అవగాహనను తెలియ చేస్తుంది. ఇదిలా ఉండ‌గా మెలోనీ రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా ఇటలీ, భారతదేశ జాతీయ జెండాలను సూచించే రెండు ఎమోటికాన్‌లను జతచేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *