కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

అన్ని సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం మ‌రో 23 మందికి నూత‌న కేబినెట్ లో చోటు క‌ల్పించారు. ఇందులో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు సీఎం. ఇదే క్ర‌మంలో టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మిగ‌తా ముస్లిం లీగ్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు బ‌య‌టి నుంచి విజ‌య్ స‌ర్కార్ కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. విశ్వ‌స‌నీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవుల కేటాయింపును విజయ్ ప్రధానంగా జాన్ అరోకియసామి, ఎన్. ఆనంద్ చేసిన సిఫార్సుల ఆధారంగానే చేపట్టారు.

ముఖ్యంగా ‘విజయ్ మక్కల్ ఇయక్కం’కు చెందిన 16 మంది సభ్యులను మంత్రులుగా నియమించారు. మంత్రివర్గంలో తన దీర్ఘకాలిక మద్దతుదారులకు తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడాలని విజయ్ ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ వ్యక్తులను గుర్తించి ఎంపిక చేసే బాధ్యతను ఆనంద్‌కు అప్పగించారు . అదే సమయంలో, శాఖల కేటాయింపున‌కు సంబంధించిన నిర్ణయాలు, అలాగే ముస్లిం లీగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన రాజకీయ ఆవశ్యకత వంటి అంశాలపై జాన్ ప్రభావం బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. జాన్ చేసిన సూచనలను విజయ్ నిశితంగా ఆలకించి, మంత్రివర్గ కూర్పులో వాటిని తుది రూపంలో పొందుపరిచినట్లు భావిస్తున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *