తమిళ‌నాడు కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రికి చోటు

ప్ర‌మాణ స్వీకారం చేసిన వ‌న్ని అర‌సు, షాజ‌హాన్
చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. ఇప్ప‌టికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా ఇంకో ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రులుగా కొలువు తీరారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపిన వీసీకే పార్టీ, ముస్లిం లీగ్ పార్టీల‌ను కూడా కేబినెట్ లో చేరాల‌ని కోరారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

ఆయ‌న కోరిక‌ను మ‌న్నించాయి ఆయా పార్టీలు. ఈ మేర‌కు కీల‌క స‌మావేశం నిర్వ‌హించి తాము కూడా కేబినెట్ లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ప్రధాన సచివాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారై మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రాజేష్ కుమార్ , పి. విశ్వనాథన్, విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన వన్ని అరసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఏ.ఎం.ఎం. షాజహాన్ క‌లిశారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం విజ‌య్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *