newsseals.com
News

విద్య తోనే వికాసం..విజ్ఞానం : క‌మిష‌న‌ర్

VijayaBhaskar May 23, 2026
newsseals-GHMCCommissoner
Spread the love

అంత‌ర్జాతీయ జీవ వైవిధ్య దినోత్స‌వం

హైద‌రాబాద్ : జీవితంలో ఎద‌గాలంటే త‌ప్ప‌నిస‌రిగా విద్య అనేది త‌ప్ప‌కుండా ఉండాల‌న్నారు హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ కమిష‌న‌ర్ క‌ర్ణ‌న్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బయో డైవర్సిటి బోర్డు పాఠశాల విద్యార్థులకు ఫోటోగ్రఫీ ,వ్యాస, ఉపన్యాస పోటీలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు హైదరాబాదు బిర్లా ప్లానిటోరియం లోని భాస్కర హాలులో బహుమతులు అందజేశారు.

బోర్డు కార్యదర్శి కాళిచరణ్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫోటోగ్రఫీ లో మొదటి బహుమతి, ఉపన్యాస పోటీలో రెండో బహుమతిని కామారెడ్డి జిల్లా సిద్దిరామేశ్వర నగర్ కు చెందిన అరవ తరగతి చదువుతున్న సంహిత గెలుచుకుంది. అలాగే వ్యాస రచన పోటీలో 8 వ తరగతి చదువుతున్న సహస్ర మూడో బహుమతి గెలుచుకుంది. ఈ సంద‌ర్బంగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ ప్ర‌సంగించారు. విద్య‌తోనే వికాసం, విజ్ఞానం అల‌వ‌డుతుంద‌న్నారు. విలువైన కాలాన్ని వృధా కానీయ‌వ‌ద్ద‌ని కోరారు.