విద్య తోనే వికాసం..విజ్ఞానం : క‌మిష‌న‌ర్

అంత‌ర్జాతీయ జీవ వైవిధ్య దినోత్స‌వం

హైద‌రాబాద్ : జీవితంలో ఎద‌గాలంటే త‌ప్ప‌నిస‌రిగా విద్య అనేది త‌ప్ప‌కుండా ఉండాల‌న్నారు హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ కమిష‌న‌ర్ క‌ర్ణ‌న్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బయో డైవర్సిటి బోర్డు పాఠశాల విద్యార్థులకు ఫోటోగ్రఫీ ,వ్యాస, ఉపన్యాస పోటీలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు హైదరాబాదు బిర్లా ప్లానిటోరియం లోని భాస్కర హాలులో బహుమతులు అందజేశారు.

బోర్డు కార్యదర్శి కాళిచరణ్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫోటోగ్రఫీ లో మొదటి బహుమతి, ఉపన్యాస పోటీలో రెండో బహుమతిని కామారెడ్డి జిల్లా సిద్దిరామేశ్వర నగర్ కు చెందిన అరవ తరగతి చదువుతున్న సంహిత గెలుచుకుంది. అలాగే వ్యాస రచన పోటీలో 8 వ తరగతి చదువుతున్న సహస్ర మూడో బహుమతి గెలుచుకుంది. ఈ సంద‌ర్బంగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ ప్ర‌సంగించారు. విద్య‌తోనే వికాసం, విజ్ఞానం అల‌వ‌డుతుంద‌న్నారు. విలువైన కాలాన్ని వృధా కానీయ‌వ‌ద్ద‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *