కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

టీవీకే లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌న్న మంత్రి

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ పార్టీ నాయ‌కుడు, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో, ప్ర‌చారం సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌ల‌లో, కార్న‌ర్ మీటింగ్ ల‌లో , చివ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో కూడా సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టించార‌ని చెప్పారు ర‌మేష్‌.

కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాలకు అల‌వాటుగా మారింద‌న్నారు. టీవీకే లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్నారు. నాకు గానీ, డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌కు గానీ కుల గుర్తింపు ఆధారంగా ఓట్లు రాలేదన్నారు ర‌మేష్, ముఖ్యమంత్రి విజ‌య్ నాయకత్వం వల్లే వచ్చాయ‌న్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కుల, మత భేదాలకు అతీతంగా తమ సొంత కుటుంబ సభ్యునిగా భావించారని పేర్కొన్నారు. ఇదే భావన పార్టీ అభ్యర్థులకు, మంత్రులకు కూడా వర్తించిందన్నారు. కుల ప్రాతిపదికన ఏ పదవులూ ఇవ్వలేదన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *