విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

అధికారుల‌ను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి : ఏపీలో భారీ ఎత్తున వ‌డ‌గాల్పులతో పాటు అకాల వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియ‌డం, గాలి వాన‌ల బీభ‌త్సం సృష్టించ‌డంతో పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచి పోయింది. ఎక్క‌డిక‌క్క‌డ విద్యుత్ పోల్స్ విరిగి పోగా మ‌రికొన్ని నేల రాలాయి. చెట్లు సైతం ఇబ్బంది క‌లిగించాయి. దీంతో విద్ఉత్ వైర్లు తెగి పోయాయి. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు కీల‌క సూచ‌న‌లు చేశారు.

ఈదురుగాలులతో చెట్లు, డిస్‌ప్లే హోర్డింగ్లు విద్యుత్ స్తంభాలపై పడినట్లు వివరించారు విద్యుత్ శాఖ అధికారులు .దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు గొట్టిపాటి ర‌వికుమార్. ఎక్కడికక్కడ లైన్లు క్లియర్ చేసుకుంటూ… విద్యుత్ పునరుద్ధరణ చేపడుతామన్నాని మంత్రికి తెలిపారు. అధికారులు . కాగా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు మంత్రి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *