కాంగ్రెస్ హైక‌మాండ్ ను క‌లిస్తే త‌ప్పేంటి..?

ఐటీ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కామెంట్స్

బెంగ‌ళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు అధిష్టానం ముఖ్యమంత్రి సిద్ద‌రామ‌య్య‌ని, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ ని పిలిచిందని అన్నారు. అంతే కాకుండా మరో 15-20 రోజుల్లోనే పలు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కానున్నాయని చెప్పారు. కాబట్టి, వారు అధిష్టానంతో ఆ విషయాల గురించి కూడా చర్చిస్తారని తెలిపారు.

పార్టీ ప‌రంగా , ప్ర‌భుత్వ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ అగ్ర నేత‌లు స‌మాలోచ‌న‌లు చేస్తుంటార‌ని, ఇందులో ఎలాంటి త‌ప్పుందంటూ ప్ర‌శ్నించారు ప్రియాంక్ ఖ‌ర్గే. మా నాయకులు, శాసనసభ్యులు , మండలి సభ్యులు మా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి వెళ్లడంలో తప్పేముంది అని ప్ర‌శ్నించారు. ఒకవేళ వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరేందుకు వెళ్ల లేదు క‌దా అంటూ సెటైర్ వేశారు ప్రియాంక్ ఖ‌ర్గే. అలా అయితే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంద‌న్నారు మంత్రి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *